వైభవంగా లక్ష్మినారాయణ స్వామి కల్యాణం
ABN , Publish Date - Apr 21 , 2024 | 10:29 PM
మ్యాదరిపేటలో లక్ష్మినారాయణస్వామి కల్యాణాన్ని శంకర్ శర్మ వేదమం త్రోచ్ఛారణ మధ్య ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ వ్యవస్ధాపకులు లింగాల శ్రీమతి సమక్ష్యంతో ఆల య వార్షికోత్సవం సంద ర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు.
దండేపల్లి, ఏప్రిల్ 21: మ్యాదరిపేటలో లక్ష్మినారాయణస్వామి కల్యాణాన్ని శంకర్ శర్మ వేదమం త్రోచ్ఛారణ మధ్య ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ వ్యవస్ధాపకులు లింగాల శ్రీమతి సమక్ష్యంతో ఆల య వార్షికోత్సవం సంద ర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని చూడముచ్చటగా నిర్వహించి స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పోశారు. అనంతరం పలువురు భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి కల్యాణం తిలకించి, ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలతో పాటు అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్ధులు పాల్గొన్నారు.