ప్రజా సంఘాల బలోపేతానికి కృషి చేయాలి
ABN , Publish Date - Apr 21 , 2024 | 10:31 PM
ప్రజా ఉద్య మాల నిర్మాణానికి పార్టీని, ప్రజా సంఘాలను సన్న ద్ధ పర్చడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావా లని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 21: ప్రజా ఉద్య మాల నిర్మాణానికి పార్టీని, ప్రజా సంఘాలను సన్న ద్ధ పర్చడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావా లని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావే శంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు విలు వలను పెంపొందించడంలో ప్రతీ ఒక్కరు శక్తి వం చన లేకుండా కృషి చేయాలని, కొందరు వ్యక్తుల కారణంగా పార్టీ నిర్మాణ పద్ధతులు ఏకపక్ష వైఖరితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. జిల్లాలో సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పని చేస్తున్న నాయ కులను కలుపుకుని పని చేయాల న్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమా లకు పాల్పడుతున్న ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామన్నారు. ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్ధతులను పాటిం చాలని, లేదంటే క్రమశిక్షణ చర్యల కు గురి కాక తప్పదన్నారు. మేకల రామ న్న, రమేష్, సారయ్య, కలీల్, రాజేశ్వర్రావు, సురేందర్, షాహిన్, ప్రభంజన్ పాల్గొన్నారు.