Share News

కాంగ్రెస్‌ నాయకుల సంబరాలు

ABN , Publish Date - Jun 04 , 2024 | 10:59 PM

లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపొందడంతో మంగళవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ఆధ్వ ర్యంలో కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాల యం వద్ద కేక్‌ కట్‌ చేసి స్వీట్లు తినిపించుకున్నారు.

కాంగ్రెస్‌ నాయకుల సంబరాలు

బెల్లంపల్లి, జూన్‌ 4: లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపొందడంతో మంగళవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ఆధ్వ ర్యంలో కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాల యం వద్ద కేక్‌ కట్‌ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. కాంటా చౌరస్తా వద్ద టపాసులు పేల్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గడ్డం వంశీకృష్ణ కృషి చేస్తారన్నారు. ఎన్నికల సమయంలో కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.

జైపూర్‌: పెద్దపల్లి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ గెలవడంతో మం డలంలో కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు. నాయకులు ఫయాజ్‌, రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, మం తెన లక్ష్మణ్‌, శీలం వెంకటేష్‌ పాల్గొన్నారు.

కాసిపేట: పెద్దపల్లి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందడంపై మండలంలో కాంగ్రెస్‌ నాయకులు సంబ రాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి పెట్టారు. కాసిపేట మండలం నుంచి అధిక మెజార్టీ ఇవ్వడంతోపాటు, వంశీని గెలిపించినందుకు నాయకులు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

చెన్నూరు: చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్య కర్తలు సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచి పెడుతూ శుభా కాంక్షలు తెలుపుకున్నారు. మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భీమారం: పెద్దపల్లి పార్లమెంట్‌ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలవడంతో మండల కేంద్రంలోని ఆవడం ఎక్స్‌రోడ్డు వద్ద కాంగ్రెస్‌ నాయకులు ఘనం గా సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశా రు. చేకుర్తి సత్యనారాయణరెడ్డి, పోడేటి రవి, శ్రీనివాస్‌, అమర్‌సింగ్‌నా యక్‌, శంకర్‌ నాయక్‌, తిరుపతి, నరేందర్‌, భాస్కర్‌రెడ్డి, పాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌: పెద్దపల్లి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్ధిగా గడ్డం వంశీకృష్ణ గెలవడంతో మందమర్రిలో సంబరాలు నిర్వహించారు. కోల్‌బెల్ట్‌ రోడ్డు నుంచి మార్కెట్‌ వరకు ర్యాలీగా వచ్చి మార్కెట్‌ సెంటర్‌లో బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. దుర్గం నరేష్‌, గుడ్ల రమేష్‌, నామిని ముత్తయ్య, ఎండీ పాషా, సంగి సంతోష్‌, కిరణ్‌, రవి, శ్రీను, పాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 10:59 PM