Share News

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:18 PM

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని బెల్లంపల్లి ఏసీపీ సదయ్య అన్నారు. ఆదివారం ఎఎంసీ మైదానంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్‌ కన్వీనర్‌ నాతరి స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్ధాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఏసీపీ ప్రారంభించి మాట్లాడారు.

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

బెల్లంపల్లి, జనవరి 7: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని బెల్లంపల్లి ఏసీపీ సదయ్య అన్నారు. ఆదివారం ఎఎంసీ మైదానంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్‌ కన్వీనర్‌ నాతరి స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్ధాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఏసీపీ ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి టోర్నమెంట్‌లు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగు తాయన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాల న్నారు. టోర్నీలో బెల్లంపల్లి బార్‌ అసోసియేషన్‌ టీం, మున్సిపల్‌ ఆఫీస్‌ టీంలు తలపడ్డాయి. రిటైర్డు డీఎస్పీ రవికుమార్‌, ఎస్‌హెచ్‌వోలు రమేష్‌, బన్సీలాల్‌, ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య, కాంగ్రెస్‌ నాయకులు చిన్నరాజం, ఈసా, ఆదర్శ్‌వర్ధన్‌రాజు, సిరంగి శంకర్‌, కొమ్ము రాజన్న, బండి లక్ష్మణ్‌, మహేష్‌, రాజేష్‌, గోపాల్‌, తారాచంద్‌, నర్సయ్య, స్వామి, బాలుయాదవ్‌,మూర్తి,నవీన్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 10:18 PM