కళాకారులను ప్రోత్సహించాలి
ABN , Publish Date - Jun 17 , 2024 | 10:40 PM
సమాజహితమే లక్ష్యంగా పనిచేస్తున్న కళలను, కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ నాయ కులు దుర్గం నరేష్, సొత్కు సుదర్శన్, గుడ్ల రమేష్లు తెలిపారు.

మందమర్రిటౌన్, జూన్ 17: సమాజహితమే లక్ష్యంగా పనిచేస్తున్న కళలను, కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ నాయ కులు దుర్గం నరేష్, సొత్కు సుదర్శన్, గుడ్ల రమేష్లు తెలిపారు. సోమవారం స్ధానిక సీఈ ఆర్ క్లబ్లో జిల్లా నృత్యకళాకారుల అసోసియేషన్, టాలెంట్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలకు వారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం కళాకా రులకు పెద్దపీట వేస్తుందన్నారు. దివంగత కాకా స్మారకార్ధం ఈ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తాము కూడా కళాకా రులకు చేయూతనందిస్తామన్నారు. నిజామా బాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల నుంచి 300 మంది కళాకారులు హాజరయ్యారు. అసోసియేషన్, డ్యాన్స్ మాస్టర్ రాంబాబు, గోపి, లక్ష్మణ్, వసుధ, వనిత, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.