కలెక్టరేట్ ఎదుట పశుమిత్రల నిరసన
ABN , Publish Date - Jan 08 , 2024 | 10:16 PM
సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట సోమవారం పశు మిత్ర వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్కు అందజేశారు.
నస్పూర్, జనవరి 8: సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట సోమవారం పశు మిత్ర వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్కు అందజేశారు. యూనియన్ నాయ కులు మాట్లాడుతూ గ్రామాల్లో రైతుల పశువులు అనారోగ్యం బారిన పడి తే వైద్యం అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తమకు వేతనాలు ఇవ్వ లేదని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వేతనాల విషయంపై ఆలోచించాలని కోరారు. కనీస వేతనాలతోపాటు ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలను కల్పించాలని కోరారు. నాయకులు నాగమణి, లావణ్య, సీఐటీయు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్, నాయకులు సరోజ, శ్యామల, సరిత, శారద, స్వప్న, జ్యోతి, రమ్య. శైలజా తదితరులు పాల్గొన్నారు.