కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:35 PM
మండలంలోని గోండు గూడ గ్రామంలో దివంగత కుర్సెంగు లక్ష్మణ్ స్మార కార్ధం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కొన సాగుతుంది. శుక్రవారం ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీజాయింట్ కన్వీర్ నాతరి స్వామి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.
బెల్లంపల్లి, ఏప్రిల్ 19: మండలంలోని గోండు గూడ గ్రామంలో దివంగత కుర్సెంగు లక్ష్మణ్ స్మార కార్ధం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కొన సాగుతుంది. శుక్రవారం ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీజాయింట్ కన్వీర్ నాతరి స్వామి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. పోచంపల్లి, బోయ పల్లి జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగగా పోచంపల్లి జట్టు విజయం సాధిస్తుంది. గెలిచిన జట్టుకు నాతరి స్వామి బహుమతులు అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు శంకర్, మాజీ సర్పంచు మొగిలి, నాయకులు భాస్కర్గౌడ్, శ్రీనివాస్, వంశీకృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు.