జిల్లాకు చేరిన అదనపు బ్యాలెట్లు
ABN , Publish Date - May 02 , 2024 | 10:51 PM
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల , బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ నెల 13న జరిగే పోలింగ్కు అదనపు బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్లోనీ ఈవీఎం గోదాంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్తో కలిసి రాజకీయ పార్టీల సమక్షంలో బ్యాలెట్ యూనిట్లను పరిశీలించారు.
మంచిర్యాల కలెక్టరేట్, మే 2 : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల , బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ నెల 13న జరిగే పోలింగ్కు అదనపు బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్లోనీ ఈవీఎం గోదాంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్తో కలిసి రాజకీయ పార్టీల సమక్షంలో బ్యాలెట్ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో 42 మంది అభ్యర్ధులు పోటీలో ఉండడంతోపాటు అదనపు బ్యాలెట్ యూనిట్లు అవసరం ఉన్నందున ఈసీఐఎల్ కంపెనీ నుంచి జిల్లాకు 1800 అదనపు బ్యాలెట్ యూని ట్లు వచ్చాయన్నారు. వీటి ర్యాండమైజేషన్ పూర్తయినా తర్వాత ఆయా సెగ్మెం ట్లకు బందోబస్తు మధ్య తరలించి స్ర్టాంగ్రూంలలో భద్రపరుస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.