తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:38 PM
గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. శుక్రవారం రామారావుపేట గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు.
జైపూర్, ఏప్రిల్ 19 : గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. శుక్రవారం రామారావుపేట గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్లపై ప్లాస్టిక్ ,చెత్తా, చెదారం లేకుండా శుభ్రం చేయించాలని కార్యదర్శికి సూచించారు. ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున నీటి సమస్య లేకుండా చూడాలని, నీటి సమస్య ఉంటే తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. నర్సరీల్లోని మొక్కలను సంరక్షించాలని సూచించారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించారు. మండల పంచాయతీ అధికారి అనిల్కుమార్, కార్యదర్శి సుమన్ తదితరులు ఉన్నారు.