బదిలీపై వెళుతున్న కలెక్టర్కు సన్మానం
ABN , Publish Date - Jun 17 , 2024 | 10:43 PM
మంచిర్యాల జిల్లా కలెక్టర్గా పనిచేసి నాగర్కర్నూల్ జిల్లాకు బదిలీపై వెళ్లిన కలెక్టర్ బదావత్ సంతోష్ను సోమవారం టీఎన్జీవో నాయకులు ఘనంగా సన్మానించారు.

మంచిర్యాల కలెక్టరేట్, జూన్ 17: మంచిర్యాల జిల్లా కలెక్టర్గా పనిచేసి నాగర్కర్నూల్ జిల్లాకు బదిలీపై వెళ్లిన కలెక్టర్ బదావత్ సంతోష్ను సోమవారం టీఎన్జీవో నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి రామ్మోహన్, మల్లయ్య, బాపురావు, శ్రీనివాస్, తఇరుపతి, శ్రావణ్, గోపాల్, సుమన్, సప్దర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. అలాగే బదిలీ అయిన కలెక్టర్ సంతోష్ను కలెక్టర్ రాహుల్, జిల్లా పంచా యతీ అధికారి వెంకటేశ్వర్లు సన్మానించి జ్ఞాపిక అం దజేశారు. ఎంపీవోల సంఘం అధ్యక్షుడు బాపురావు, డీఎల్పీవో సప్దర్ ఆలీ, ఎంపీవోలు సత్యనారాయణ , నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు శ్రావణ్, సుమన్, శ్రీనివాస్, నవ్య, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.