India vs Afghanistan: ఆలౌట్ అయిన ఆఫ్ఘనిస్తాన్.. భారత్ లక్ష్యం ఎంతంటే?
ABN , Publish Date - Jan 14 , 2024 | 08:48 PM
ఆదివారం హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. గుల్బదీన్ నాయబ్ (35 బంతుల్లో 57) అర్థశతకంతో
![India vs Afghanistan: ఆలౌట్ అయిన ఆఫ్ఘనిస్తాన్.. భారత్ లక్ష్యం ఎంతంటే?](https://media.andhrajyothy.com/media/2023/20231205/IND_vs_Afghan_Bat_134f0e00d1.jpg)
India vs Afghanistan: ఆదివారం హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. గుల్బదీన్ నాయబ్ (35 బంతుల్లో 57) అర్థశతకంతో రప్ఫాడించడంతో పాటు.. కరీం, ముజీబ్ ఉర్ రెహమాన్ చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆఫ్ఘన్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. ముఖ్యంగా.. గుల్బదీన్ తన జట్టుకి వెన్నుముకలా నిలిచాడు. తొలి వికెట్ పడ్డాక క్రీజులో వచ్చిన అతగాడు.. ఆచితూచి ఆడుతూనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. క్రీజులో ఉన్నంతసేపు భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. అతని ధాటికే ఆఫ్ఘన్ స్కోరు 172కి చేరింది.
భారత బౌలర్ల విషయానికొస్తే.. అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 32 పరుగులే ఇచ్చిన అతగాడు.. జద్రాన్, కరీమ్, నూర్ అహ్మద్ల వికెట్లను పడగొట్టాడు. ఇక రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీశారు. శివమ్ దూబె ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. భారత్కి 173 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ స్కోర్ మరీ పెద్దది కాదు, అలాగని మరీ చిన్నది కాదు. ఆఫ్ఘన్ జట్టులోనూ మంచి బౌలర్లే ఉన్నారు కాబట్టి.. బ్యాటర్లు కాస్త గట్టిగానే పోరాడాల్సి ఉంటుంది. అక్షర్ పటేల్ దాకా మంచి బ్యాటర్లే ఉన్నారు కాబట్టి.. ఆ లక్ష్యాన్ని ఛేధించడం భారత్కి పెద్ద కష్టమేమీ కాదు. మరి, మన బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి.