Share News

NRI: ఏపీలో కూటమి గెలుపు! వాషింగ్టన్‌ డీసీలో 500 కార్లతో ఎన్నారైల భారీ ప్రదర్శన

ABN , Publish Date - Jun 17 , 2024 | 09:38 PM

ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంపై అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

NRI: ఏపీలో కూటమి గెలుపు! వాషింగ్టన్‌ డీసీలో 500 కార్లతో ఎన్నారైల భారీ ప్రదర్శన

  • కూటమి గెలుపుతో అమెరికా రాజధానిలో ప్రవాసాంధ్రుల సంబరాలు

  • ఆన్‌లైన్‌లో మాట్లాడిన పెమ్మసాని, సుజనా

వాషింగ్టన్ డీసీ: ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు... మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ప్రవాసాంధ్రులు (NRI) పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మూడు పార్టీల జెండాలు చేతబూని ఎన్డీఏకు అనుకూలంగా నినాదాలు చేశారు. 500 కార్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు ప్రవాసాంధ్రులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

NRI News: ఛార్లెట్‌లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ

4.jpgఈ కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు సుజనా చౌదరి, రోషన్ కుమార్, సుందరపు విజయ్ కుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ అఖండ విజయంలో భాగస్వాములైన ఎన్ఆర్ఐలకు అభినందనలు తెలియజేశారు. అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులందరూ జన్మభూమికి వచ్చి కూటమి విజయంలో పాలుపంచుకున్నారన్నారు.

6.jpg


సుజనా చౌదరి మాట్లాడుతూ రాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టడంలో ప్రవాసాంధ్రులు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలోనూ ఎన్ఆర్ఐలు కీలకపాత్ర పోషించాలన్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ ఓటర్లు చూపిన విజ్ఞత, ప్రజ్ఞ, చైతన్యం వల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యపడిందని అన్నారు. సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఆర్థిక నేరస్థులకు, హంతకులకు, అరాచక శక్తులకు చోటులేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కూటమిగా ఏర్పడటం, మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని పునర్ నిర్మించగలుగుతారనే విశ్వాసం గెలుపునకు పునాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ ఎన్ఆర్ఐలు తమ సహాయసహకారాలను కొనసాగించాలన్నారు.

3.jpgతానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ జగన్ రెడ్డి లాంటి ఉన్మాదులకు ఈ తీర్పు ఓ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. టీడీపీ విజయంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. కూటమి చారిత్రక విజయం సాధించిందని అన్నారు. ప్రవాసాంధ్రుల సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పారు. ఏపీలో కంటే మిన్నగా తమ ఆనందాన్ని, హర్షాన్ని పంచుకున్నారన్నారు.

2.jpg


ఈ సభా కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయ పరిచారు. సుధీర్ కొమ్మి, విజయ్ గుడిసేవ, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, వేణు పులిగుజ్జు, అనిల్ ఉప్పలపాటి, త్రిలోక్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. నరేన్ కొడాలి, చంద్ర బేవర, శ్రీరామ్ తనికెళ్ల, ప్రవీణ్ దాసరి, చౌదరి యలమంచిలి, సతీష్ చింత, రాజేష్ కాసరనేని, రవి అడుసుమిల్లి, రమేష్ గుత్తా, సాయిసుధ పాలడుగు, మంజూష గోరంట్ల, శుభ ఎర్రంశెట్టి, రాధికా రామాయణం, సురేఖ చనుమోలు, సంజయ్ నాయుడు, కృష్ణ గుడిపాటి, యువ సిద్ధార్థ్ బోయపాటి, సమంత, మురళి, వినీల్, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

1.jpgRead Latest NRI News and Telugu News

Updated Date - Jun 17 , 2024 | 09:38 PM