అయోధ్యపై ఇంత చురుకుదనం ఎందుకు
ABN , Publish Date - Jan 07 , 2024 | 04:16 AM
అయోధ్య రామమందిరం కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటుండడంపై జమాతే ఉలేమా ఏ హింద్ (మహమ్మద్ మదానీ వర్గం) ఆందోళన వ్యక్తం చేసింది.
![అయోధ్యపై ఇంత చురుకుదనం ఎందుకు](https://media.andhrajyothy.com/media/2023/20231205/ayodhya_772393789f.jpg)
కేంద్రానికి జమాతే ఉలేమా ప్రశ్న
న్యూఢిల్లీ, జనవరి 6: అయోధ్య రామమందిరం కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటుండడంపై జమాతే ఉలేమా ఏ హింద్ (మహమ్మద్ మదానీ వర్గం) ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ప్రభావం చూపడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రయత్నిస్తోందని అభిప్రాయపడింది. పక్షపాత విధానాలను అనుసరించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రామ మందిర ప్రతిష్ఠ నేపథ్యంలో మైనార్టీలను వేధించే సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.