Share News

డాటాను వాడండి..దండాన్ని కాదు

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:22 AM

పోలీసులు సమాచారాన్ని(డాటా) ఉపయోగించి పనిచేయాలే తప్ప దండాన్ని ఉపయోగించి కాదని ప్రధాని మోదీ హితవు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకునే నూతనంగా మూడు ‘సంహిత’లను తీసుకొచ్చినట్టు తెలిపారు. ‘

డాటాను వాడండి..దండాన్ని కాదు

డీజీపీల సమావేశంలో ప్రధాని మోదీ

జైపూర్‌, జనవరి 7: పోలీసులు సమాచారాన్ని(డాటా) ఉపయోగించి పనిచేయాలే తప్ప దండాన్ని ఉపయోగించి కాదని ప్రధాని మోదీ హితవు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకునే నూతనంగా మూడు ‘సంహిత’లను తీసుకొచ్చినట్టు తెలిపారు. ‘పౌరులు ప్రథమం..గౌరవం ప్రథమం..న్యాయం ప్రథమం’ అన్న సందేశంతో వీటిని రూపొందించినట్టు చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన 58వ డీజీపీలు, ఐజీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. నూతన క్రిమినల్‌ చట్టాల ప్రాధాన్యతను వివరించారు. డాటా ఆధారంగా దర్యాప్తులు ఉండాలని చెప్పారు. దేశ క్రిమినల్‌ న్యాయ వ్యవస్థలో అవి నిర్ణయాత్మక మార్పులు తీసుకొస్తాయని చెప్పారు. మహిళల భద్రతపై దృష్టి కేంద్రీకరించాలని, వారు ఎప్పుడైనా, ఎక్కడైనా నిర్భయంగా పనిచేసేలా పరిస్థితులు కల్పించాలని కోరారు. మహిళలు, బాలికలకు వారి హక్కులపై అవగాహన కలిగించాలని, కొత్త చట్టాల ద్వారా వారికి కలిగే రక్షణను వివరించాలని సూచించారు.

Updated Date - Jan 08 , 2024 | 06:57 AM