అయోధ్యలో యూపీ ‘అసెంబ్లీ’
ABN , Publish Date - Feb 12 , 2024 | 03:19 AM
అయోధ్యలోని రామమందిరాన్ని ఆదివారం 325 మందికి పైగా ఉత్తరప్రదేశ్ శాసనసభ్యులు సందర్శించి పూజలు నిర్వహించారు.
![అయోధ్యలో యూపీ ‘అసెంబ్లీ’](https://media.andhrajyothy.com/media/2023/20231205/fklndhb_37bf23f22c.jpg)
సీఎం యోగి పూజలు..పాల్గొన్న 325 మందికి పైగా శాసన సభ్యులు
అయోధ్య/లఖ్నవూ, ఫిబ్రవరి 11: అయోధ్యలోని రామమందిరాన్ని ఆదివారం 325 మందికి పైగా ఉత్తరప్రదేశ్ శాసనసభ్యులు సందర్శించి పూజలు నిర్వహించారు. లఖ్నవూ నుంచి 10 బస్సుల్లో రాష్ట్ర ఉభయ సభల సభ్యులు అయోధ్యకు చేరుకున్నారు. మందిరం అంతా ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగింది. ఆలయంలో పూజలు నిర్వహించామంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మందిరం మెట్ల వద్ద ఫొటోలు దిగారు.