ఉగ్రదాడిలో ఇద్దరు సైనికుల మృతి
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:20 AM
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీని కలిసిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గురువారం బారాముల్లాలోని గుల్మార్గ్ వద్ద బుటపథ్రి ప్రాంతంలో 18

న్యూఢిల్లీ, అక్టోబరు 24: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీని కలిసిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గురువారం బారాముల్లాలోని గుల్మార్గ్ వద్ద బుటపథ్రి ప్రాంతంలో 18 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన సైనికుల గస్తీ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూలీలు మృతిచెందారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ముష్కరుల కోసం వేట ముమ్మరం చేసింది. అంతకుముందు ఉగ్రవాదుల కాల్పుల్లో యూపీకి చెందిన ఓ వలసకార్మికుడు మరణించాడు.