మనీష్ సిసోడియాకు మూడు రోజుల బెయిల్
ABN , Publish Date - Feb 13 , 2024 | 04:49 AM
ఢిల్లీ ఎక్సయిజ్ విధానం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాకు సోమవారం ఇక్కడి ప్రత్యేక కోర్టు మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది. మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు మంగళవారం నుంచి
![మనీష్ సిసోడియాకు మూడు రోజుల బెయిల్](https://media.andhrajyothy.com/media/2023/20231205/dd_5bd67f6223.jpg)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఢిల్లీ ఎక్సయిజ్ విధానం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాకు సోమవారం ఇక్కడి ప్రత్యేక కోర్టు మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది. మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు మంగళవారం నుంచి గురువారం వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ ఆయనను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించింది. కాగా, మనీలాండరింగ్ వ్యవహారంలో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ ఈడీ రిమాండ్ను మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ రాంచీలోని ప్రత్యేకకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం మంగళవారం శ్రీనగర్లోని తమ కార్యాలయానికి రావాలంటూ ఈడీ జమ్మూ-కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (86)కు తాజాగా సమన్లు పంపించింది