Share News

Republic Day: అయోధ్య థీమ్‌తో ఉత్తరప్రదేశ్ శకటం.. ఆకట్టుకున్న బాలరాముడి రూపం

ABN , Publish Date - Jan 26 , 2024 | 12:29 PM

దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు(Republic Day 2024) ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Republic Day: అయోధ్య థీమ్‌తో ఉత్తరప్రదేశ్ శకటం.. ఆకట్టుకున్న బాలరాముడి రూపం

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు(Republic Day 2024) ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన జరిగాయి. అయితే ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ శకటం విశేషంగా ఆకట్టుకుంది.

జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరగ్గా.. సరిగ్గా ఇదే థీమ్‌తో 'అయోధ్య: విక్షిత్ భారత్-సమ్రాధ్ విరాసత్' ఆధారంగా దీన్ని రూపొందించారు. శకటం ముందు భాగంలో రాముడి చిన్ననాటి రూపాన్ని ఉంచారు. వెనకభాగంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తాలుకూ విషయాలను వివరించేలా డిజైన్ చేశారు.

Updated Date - Jan 26 , 2024 | 12:31 PM