మత విద్వేష ప్రచారకులకు బ్రిటన్లో ప్రవేశంపై నిషేధం!
ABN , Publish Date - Mar 04 , 2024 | 04:46 AM
తీవ్రవాద ఇస్లామిక్ భావజాలంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేసే ముస్లిం ప్రచారకులను దేశంలోకి రానీయకూడదని బ్రిటన్ నిర్ణయించింది.
![మత విద్వేష ప్రచారకులకు బ్రిటన్లో ప్రవేశంపై నిషేధం!](https://media.andhrajyothy.com/media/2024/20240301/66_c2a48c5fcd.jpg)
లండన్, మార్చి 3: తీవ్రవాద ఇస్లామిక్ భావజాలంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేసే ముస్లిం ప్రచారకులను దేశంలోకి రానీయకూడదని బ్రిటన్ నిర్ణయించింది. ముఖ్యంగా పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, ఇండోనేషియా వంటి దేశాల వారికి ఇది వర్తించనుంది. ఈ మేరకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించనుందని ఆదివారం మీడియా వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ప్రధాని రిషి సునాక్ తన అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తీవ్రవాదుల కారణంగా దేశ ప్రజాస్వామ్యానికి, బహుళ మత విశ్వాసాలకు నష్టం కలుగుతోందని చెప్పారు. అలాంటి వారిని దేశంలోకి రానీయబోమని తెలిపారు.