Share News

Manipur: మణిపుర్‌లో ఇద్దరు జవాన్ల మృతి

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:08 AM

మణిపుర్‌లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బిష్ణూపుర్‌ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులకు తెగబడడంతో ఇద్దరు జవాన్లు మరణించారు.

Manipur: మణిపుర్‌లో ఇద్దరు జవాన్ల మృతి

మణిపుర్‌, ఏప్రిల్‌ 27: మణిపుర్‌లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బిష్ణూపుర్‌ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులకు తెగబడడంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి నరన్‌సైనా ప్రాంతంలో జరిగింది.

రెండో విడుత లోక్‌సభ ఎన్నికలలో భాగంగా శుక్రవారం అవుట్‌ మణిపుర్‌లో పోలింగ్‌ జరిగింది. నరన్‌సైనా ప్రాంతంలో పోలింగ్‌ విధులకు హాజరైన సీర్పీఎఫ్‌ సిబ్బంది శుక్రవారం రాత్రి అక్కడి ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌ శిబిరం వద్ద బస చేశారు. ‘‘శుక్రవారం అర్ధరాత్రి 12.30 నుంచి 2.15వరకు దాదాపు రెండు గంటలపాటు తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బాంబులూ విసిరారు’’ అని పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 07:02 AM