Rajya Sabha : రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:08 AM
రాజ్యసభలో కొత్తగా పది ఖాళీలు ఏర్పడ్డాయి. ఇటీవలి ఎలక్షన్లో పది మంది ఎగువసభ సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడమే ఇందుకు కారణం. అస్సాం, బీహార్, మహారాష్ట్రల్లో రెండేసి ఖాళీలు, హరియాణా, మధ్యప్రదేశ్,

న్యూఢిల్లీ, జూన్ 11: రాజ్యసభలో కొత్తగా పది ఖాళీలు ఏర్పడ్డాయి. ఇటీవలి ఎలక్షన్లో పది మంది ఎగువసభ సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడమే ఇందుకు కారణం. అస్సాం, బీహార్, మహారాష్ట్రల్లో రెండేసి ఖాళీలు, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఖాళీలు ఏర్పడ్డాయని రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది. లోక్సభకు ఎన్నికయిన ప్రముఖుల్లో సర్బానంద్ సోనోవాల్ (అస్సాం), మీసా భారతి (బిహార్), దీపేందర్ సింగ్ హూడా (హరియాణా), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్), పీయూష్ గోయల్ (మహారాష్ట్ర), కె.సి.వేణుగోపాల్ (రాజస్థాన్), బిప్లబ్ కుమార్ దేవ్ (త్రిపుర) ఉన్నారు.