Share News

జామా మసీదు షాహీ ఇమాంవారసుడిగా షాబాన్‌

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:47 AM

ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదు నిర్వహణ బాధ్యతలు చూసే షాహీ ఇమాం సయ్యద్‌ అహ్మద్‌ బుఖారీ తన వారసుడ్ని ప్రకటించారు.

జామా మసీదు షాహీ ఇమాంవారసుడిగా షాబాన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదు నిర్వహణ బాధ్యతలు చూసే షాహీ ఇమాం సయ్యద్‌ అహ్మద్‌ బుఖారీ తన వారసుడ్ని ప్రకటించారు. తన కుమారుడైన సయ్యద్‌ షాబాన్‌ బుఖారీ (29)కి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు. తన మరణం తరువాత జామా మసీదుకు 14వ షాహీ ఇమాంగా వ్యవహరిస్తారని ప్రకటించారు. వారసత్వ ప్రకటనలో భాగంగా సోమవారం మసీదు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో షాబాన్‌బుఖారీకి ‘దస్తర్‌ బందీ’(తలపాగా ధారణ) ఉత్సవాన్ని నిర్వహించారు.

Updated Date - Feb 27 , 2024 | 08:46 AM