జామా మసీదు షాహీ ఇమాంవారసుడిగా షాబాన్
ABN , Publish Date - Feb 27 , 2024 | 03:47 AM
ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదు నిర్వహణ బాధ్యతలు చూసే షాహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ తన వారసుడ్ని ప్రకటించారు.
![జామా మసీదు షాహీ ఇమాంవారసుడిగా షాబాన్](https://media.andhrajyothy.com/media/2024/20240224/11_0ecfa4d906.jpg)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదు నిర్వహణ బాధ్యతలు చూసే షాహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ తన వారసుడ్ని ప్రకటించారు. తన కుమారుడైన సయ్యద్ షాబాన్ బుఖారీ (29)కి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు. తన మరణం తరువాత జామా మసీదుకు 14వ షాహీ ఇమాంగా వ్యవహరిస్తారని ప్రకటించారు. వారసత్వ ప్రకటనలో భాగంగా సోమవారం మసీదు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో షాబాన్బుఖారీకి ‘దస్తర్ బందీ’(తలపాగా ధారణ) ఉత్సవాన్ని నిర్వహించారు.