Share News

పథకాల ప్రకటనలపై జగన్‌ ఫొటోలా?

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:07 AM

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనల్లో సీఎంజగన్‌ ఫొటోలను ముద్రిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది.

పథకాల ప్రకటనలపై జగన్‌ ఫొటోలా?

  • ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే: ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనల్లో సీఎంజగన్‌ ఫొటోలను ముద్రిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆయన ప్రభుత్వం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సల్మాన్‌ ఖుర్షీద్‌, పవన్‌ ఖేరా, గుర్దీప్‌ సప్పల్‌ మంగళవారమిక్కడ ఈసీ అధికారులను కలిశారు. అనంతరం ఖుర్షీద్‌ విలేకరులతో మాట్లాడారు. తమ ఫిర్యాదులను ఈసీ సీరియ్‌సగా తీసుకుందని చెప్పారు.

Updated Date - Apr 03 , 2024 | 07:02 AM