Share News

నవ భారతం ప్రమాదకరమైంది.. యూఎన్‌లో పాక్‌

ABN , Publish Date - May 23 , 2024 | 05:47 AM

భారత్‌లో ప్రధాని మోదీ చెప్తున్న నవ భారతం ప్రమాదకరమైనదని ఐక్యరాజ్యసమితిలో పాక్‌ శాశ్వత ప్రతినిధి మునీర్‌ అక్రమ్‌ అన్నారు. కొద్ది రోజుల క్రితం యూఎన్‌

నవ భారతం ప్రమాదకరమైంది.. యూఎన్‌లో పాక్‌

న్యూయార్క్‌, మే 22: భారత్‌లో ప్రధాని మోదీ చెప్తున్న నవ భారతం ప్రమాదకరమైనదని ఐక్యరాజ్యసమితిలో పాక్‌ శాశ్వత ప్రతినిధి మునీర్‌ అక్రమ్‌ అన్నారు. కొద్ది రోజుల క్రితం యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌ పాకిస్థాన్‌లో పలువురిని టార్గెట్‌ చేసుకొని చంపుతోందని, ఇది కెనడాకు విస్తరించిందని.. అమెరికా, ఇతర దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని అన్నారు. ‘‘ఇది నవ భారతం. మీ దేశానికి వచ్చి మరీ హతమారుస్తుంది’’ అంటూ మోదీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

Updated Date - May 23 , 2024 | 07:32 AM