ఇక బ్లాక్ కమాండోలు కనిపించరు!
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:25 AM
వీఐపీలకు వ్యక్తిగత భద్రతను కల్పిస్తున్న ఎన్ఎ్సజీ బ్లాక్ కమాండోలు, ఐటీబీపీ బలగాలను ఆ బాధ్యతల నుంచి మోదీ సర్కారు తప్పించనుంది. వాటి స్థానంలో సీఆర్పీఎ్ఫకు ఈ బాధ్యతలను కేటాయించనుంది.

న్యూఢిల్లీ, జూన్- 11: వీఐపీలకు వ్యక్తిగత భద్రతను కల్పిస్తున్న ఎన్ఎస్జీ బ్లాక్ కమాండోలు, ఐటీబీపీ బలగాలను ఆ బాధ్యతల నుంచి మోదీ సర్కారు తప్పించనుంది. వాటి స్థానంలో సీఆర్పీఎఫ్కు ఈ బాధ్యతలను కేటాయించనుంది. తీవ్రవాద, ఉగ్రవాద ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు, తదితర ముఖ్యనేతలను బ్లాక్ క్యాట్ కమాండోలు కంటిరెప్పలా ఇప్పటిదాకా కాపాడుతూ వస్తున్నారు. ఇకపై వారి సేవలను ఇతర పారామిలిటరీ విధులకు వినియోగించుకోనున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. ప్రముఖుల వ్యక్తిగత భద్రతను సీఆర్పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ యూనిట్, సీఐఎస్ఎఫ్ వీఐపీ వింగ్ (ఎన్ఎస్జీ) ఇక ముందు చూస్తాయి. ఈ విభాగాలు ఇప్పటికే సోనియా కుటుంబానికి, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ తదితర 200 మందికి భద్రత అందిస్తున్నాయి.