Share News

సహస్త్రతాళ్‌ ట్రెక్కింగ్‌లో తొమ్మిది మంది మృతి

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:32 AM

ఉత్తరాఖండ్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన తొమ్మిది మంది కర్ణాటకవాసులు ప్రతికూల వాతావరణంలో చిక్కుకొని మరణించారు. కర్ణాటకకు చెందిన 18 మంది, మహారాష్ట్రకు చెందిన ఒకరు, స్థానిక గైడ్‌లు

సహస్త్రతాళ్‌ ట్రెక్కింగ్‌లో తొమ్మిది మంది మృతి

ఉత్తరకాశీ/బెంగళూరు, జూన్‌ 5: ఉత్తరాఖండ్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన తొమ్మిది మంది కర్ణాటకవాసులు ప్రతికూల వాతావరణంలో చిక్కుకొని మరణించారు. కర్ణాటకకు చెందిన 18 మంది, మహారాష్ట్రకు చెందిన ఒకరు, స్థానిక గైడ్‌లు ముగ్గురుతో కూడిన మొత్తం 22 మంది బృందం మే 29న ఎగువ హిమాలయ ప్రాంతంలోని 4,100 నుంచి 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్త్రతాళ్‌ ఆల్ఫైన్‌ సరస్సు వరకు ట్రెక్కింగ్‌కు బయలుదేరింది. ఈనెల 7 నాటికి ఈ బృందం తిరిగి రావాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం వల్ల బృందం దారి తప్పింది. వారిలో కర్ణాటకకు చెందిన తొమ్మిది మంది మరణించినట్టు సమాచారం అందిందని కర్ణాటక అఽధికారులు తెలిపారు. మిగిలినవారిలో కొందరిని కాపాడామని, ఇంకొందరి జాడ కోసం వెతుకుతున్నామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు.

Updated Date - Jun 06 , 2024 | 05:32 AM