Share News

23 మంది పాకిస్థానీయులను కాపాడిన నేవీ

ABN , Publish Date - Mar 31 , 2024 | 04:36 AM

భారత నౌకా దళం మరోసారి సత్తా చాటింది. సముద్రపు దొంగల ఆట కట్టించి, 23 మంది పాకిస్థానీయులను కాపాడింది.

23 మంది పాకిస్థానీయులను కాపాడిన నేవీ

న్యూఢిల్లీ, మార్చి 30: భారత నౌకా దళం మరోసారి సత్తా చాటింది. సముద్రపు దొంగల ఆట కట్టించి, 23 మంది పాకిస్థానీయులను కాపాడింది. చేపల వేటకు వెళ్లిన ఓడను 9 మంది సాయుధులైన సముద్రపు దొంగలు ఏడెన్‌ జలసంధి సమీపంలో హైజాక్‌ చేశారు. ఈ సమాచారం అందుకున్న ఇండియన్‌ నేవీ ఐఎన్‌ఎ్‌స సుమేధాతో రంగంలోకి దిగింది. సముద్రపు దొంగల ఆధీనంలోని ‘ఏఐ కంబార్‌’ ఓడను అడ్డగించింది. సుమేధాకు ఐఎన్‌ఎ్‌స త్రిశూల్‌ బాసటగా నిలిచింది. 12 గంటల పాటు సాహసోపేతంగా కొనసాగిన ఈ ఆపరేషన్‌తో సముద్రపు దొంగలు లొంగిపోయారు. ఓడలోని 23 మంది పాక్‌కు చెందిన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ‘ఆపరేషన్‌ సంకల్ప్‌’లో భాగంగా భారతనౌకాదళం సముద్రపు దొంగల బారి నుంచి వంద రోజుల్లో 110 మందిని కాపాడింది

Updated Date - Mar 31 , 2024 | 07:54 AM