శబరిమలలో వైభవోపేతంగా మకరవిళక్కు
ABN , Publish Date - Jan 17 , 2024 | 03:52 AM
‘‘స్వామియే శరణం అయ్యప్పా’’.. అంటూ వేల మంది భక్తుల శరణుఘోషల మధ్య శబరిమల అయ్యప్ప సన్నిధిలో
తిరువనంతపురం/న్యూఢిల్లీ, జనవరి 16: ‘‘స్వామియే శరణం అయ్యప్పా’’.. అంటూ వేల మంది భక్తుల శరణుఘోషల మధ్య శబరిమల అయ్యప్ప సన్నిధిలో వైభవోపేతంగా మకరవిళక్కు వేడుకలు జరిగాయి. సోమవారం సాయంత్రం 6.45 సమయంలో సన్నిధానానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు(కాంతిమల)పై అయ్యప్పస్వామి జ్యోతిరూపంలో దర్శనమిచ్చారు. ఇదిలా ఉండగా, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ. ముఖ్యంగా గంగానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశమైన పశ్చిమబెంగాల్లోని ‘గంగాసాగర్’ ప్రాంతానికి భక్తులు పోటెత్తుతారు. సోమవారం రికార్డు స్థాయిలో కోటి మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, సమీపంలోని కపిల మహర్షి ఆలయాన్ని సందర్శించారని అధికారులు తెలిపారు. అటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమంలోనూ 21 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించారు.