ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్షం నిల్!
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:01 AM
ఏ రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా లేని అసెంబ్లీల జాబితాలో తాజాగా మహారాష్ట్ర చేరింది.
న్యూఢిల్లీ, నవంబరు 24: ఏ రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా లేని అసెంబ్లీల జాబితాలో తాజాగా మహారాష్ట్ర చేరింది. ఇప్పటికే ఇలా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర చేరడంతో వీటి సంఖ్య ఏడుకు చేరింది. అసెంబ్లీలో ఒకపార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ రాష్ట్ర శాసనసభ స్థానాల్లో పది శాతం సీట్లను సంపాదించుకోవాల్సి ఉంటుంది. శనివారం వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో.. మహావికాస్ అఘాడీలోని ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేలా సీట్లు రాలేదు. ఈ కూటమిలోని శివసేన (యూబీటీ)కు 20 సీట్లు, కాంగ్రె్సకు 16, ఎన్సీపీ (శరద్ పవార్)కి 10 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీలోని మొత్తం 288 సీట్లలో పది శాతం అంటే 29 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది.