అధికారంలోకి వస్తే చట్టబద్ధ ఎమ్మెస్పీ: రాహుల్
ABN , Publish Date - Mar 03 , 2024 | 05:00 AM
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతులకు చట్టబద్ధంగా మద్దతు ధర(ఎమ్మెస్పీ) కల్పించేలా హామీని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చుతున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం పేర్కొన్నారు.
భోపాల్, మార్చి 2: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతులకు చట్టబద్ధంగా మద్దతు ధర(ఎమ్మెస్పీ) కల్పించేలా హామీని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చుతున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం పేర్కొన్నారు. రైతులు తమ ఉత్పత్తి, కష్టానికి తగిన ధరను, ఎమ్మెస్పీని మాత్రమే అడుగుతున్నారన్నారు. కానీ పంటలు కోతకు సిద్ధం కాగానే వ్యవసాయ కమోడిటీల ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తన దిగుమతి-ఎగుమతి విధానాన్ని మార్చుతోందని ఆరోపించారు. దీని వల్ల రైతులు తమ ఉత్పత్తిని తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని చెప్పారు. కాగా, ఇండియా కూటమి ప్రభుత్వం తొలుత కుల గణన పని చేపడుతుందని పేర్కొన్నారు.