Exit polls : విజయంపై ‘ఇండియా’ నేతల ధీమా..
ABN , Publish Date - Jun 02 , 2024 | 06:45 AM
ఎగ్జిట్పోల్స్ ఎలా ఉన్నప్పటికీ.. ఇండియా కూటమి 295కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఇండియా కూటమి నేతలు సమావేశమై
![Exit polls : విజయంపై ‘ఇండియా’ నేతల ధీమా..](https://media.andhrajyothy.com/media/2024/20240530/2jairam_F_2db6f553e3.jpg)
న్యూఢిల్లీ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ఎగ్జిట్పోల్స్ ఎలా ఉన్నప్పటికీ.. ఇండియా కూటమి 295కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఇండియా కూటమి నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించారు. బీజేపీ ఎంతగా రెచ్చగొట్టినా సంయమనం కోల్పోకుండా వ్యవహరించాలని, బీజేపీ అనుకూల మీడియా సంస్థల ప్రచారానికి లోబడకూడదని సమావేశంలో నిర్ణయించారు.