తీవ్ర ఒత్తిడిలో న్యాయవ్యవస్థ: కేజ్రీవాల్
ABN , Publish Date - May 23 , 2024 | 05:54 AM
దేశంలో న్యాయవ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ విషయం దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. జూన్ 4 తరువాత ఇండియా
![తీవ్ర ఒత్తిడిలో న్యాయవ్యవస్థ: కేజ్రీవాల్](https://media.andhrajyothy.com/media/2024/20240511/55_c174c47c13.jpg)
న్యూఢిల్లీ, మే 22: దేశంలో న్యాయవ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ విషయం దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. జూన్ 4 తరువాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, న్యాయవ్యవస్థపై ఒత్తిడిని తొలగించి.. స్వేచ్ఛగా పనిచేసేలా చూస్తుందని చెప్పారు. దాంతో తనపై పెట్టిన బోగస్ కేసులనూ కొట్టేస్తారని, జూన్ 5న తాను జైలు నుంచి విడుదలవుతానని అన్నారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి.. బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.