Share News

Gurugram: దారుణం.. పిచ్చివాడు అన్న కారణంతో తల్లిని కొడుకు ఏం చేశాడంటే

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:36 AM

పిచ్చివాడు అన్న కారణంతో ఓ తల్లిని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈఘటన హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని సెక్టార్ 48 విపుల్ గ్రీన్స్ అపార్ట్‌మెంట్‌లో రాను షా(59) అనే మహిళ తన భర్త, కుమారుడు అత్రిష్(27) తో కలిసి నివసిస్తోంది.

Gurugram: దారుణం.. పిచ్చివాడు అన్న కారణంతో తల్లిని కొడుకు ఏం చేశాడంటే

గురుగ్రామ్: పిచ్చివాడు అన్న కారణంతో ఓ తల్లిని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈఘటన హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని సెక్టార్ 48 విపుల్ గ్రీన్స్ అపార్ట్‌మెంట్‌లో రాను షా(59) అనే మహిళ తన భర్త, కుమారుడు అత్రిష్(27) తో కలిసి నివసిస్తోంది. ఆమె కుమారుడికి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు. అతను చేసే పనులతో తల్లిదండ్రులు విసుగెత్తిపోయేవారు. దీంతో తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తల్లి.. కుమారుడి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన తల్లి ఆత్రిష్‌ను పిచ్చోడు అని సంబోధించింది.

తీవ్ర కోపోద్రిక్తుడైన ఆత్రిష్ తల్లిను కత్తితో ఇష్టానుసారంగా పొడిచాడు. అనంతరం ఆమె ఉంటున్న ఫ్లాట్లో మంట పెట్టి బయటకి వెళ్లిపోయాడు. వారి ఇంట్లో మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్రిమాపక దళ సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. తరువాత మంటల్లో చిక్కుకున్న షాను బయటకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడి ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అత్రిష్‌ను అదుపులోకి తీసుకున్నామని.. అతని మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Mar 11 , 2024 | 10:36 AM