Karnataka : సీఎంకు గవర్నర్ షోకాజ్ సబబే
ABN , Publish Date - Aug 06 , 2024 | 06:06 AM
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ ప్రకారమే
న్యూఢిల్లీ,ఆగస్టు5 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ ప్రకారమే కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ షోకాజ్ నోటీసు ఇచ్చారని, ఇందులో తప్పేమీ లేదని కర్ణాటక మాజీ గవర్నర్ భరద్వాజ సలహాదారు, ప్రముఖ న్యాయవాది వికాస్ బన్సోడే తెలిపారు. కర్ణాటక గవర్నర్ పద్దతి ప్రకారమే వ్యవహరించారని, ఆ షోకాజ్ నోటీ్సకు జవాబివ్వాలా లేదా అన్నది సిద్దరామయ్య నిర్ణయించుకోవాలని ఆయన ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు.