జ్ఞానవాపిని హిందువులకివ్వండి: వీహెచ్పీ
ABN , Publish Date - Jan 28 , 2024 | 01:26 AM
వారాణసీలోని జ్ఞానవాపి మసీదు స్థలాన్ని ముస్లింలు.. హిందువులకు అప్పగించాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. ఆ ప్రదేశంలో పురాతన ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించినట్లు ఆర్కియోలాజికల్
![జ్ఞానవాపిని హిందువులకివ్వండి: వీహెచ్పీ](https://media.andhrajyothy.com/media/2023/20231205/RR_a0c893e099.jpg)
న్యూఢిల్లీ, జనవరి 27: వారాణసీలోని జ్ఞానవాపి మసీదు స్థలాన్ని ముస్లింలు.. హిందువులకు అప్పగించాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. ఆ ప్రదేశంలో పురాతన ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించినట్లు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక చెబుతున్నందున.. మసీదు నిర్వహణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వివాదాస్పద స్థలంలోని వాజుఖానాగా చెబుతున్న ప్రదేశంలో శివలింగాన్ని గుర్తించిన చోట పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించాలని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్కుమార్ డిమాండ్ చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం 1991లోని సెక్షన్ 4 ప్రకారం కూడా జ్ఞానవాపి ప్రదేశాన్ని హిందూ ఆలయంగా ప్రకటించాలన్నారు. మసీదు నిర్వహణ బాధ్యతలు చూసే ఇంతెజామియా కమిటీ గౌరవప్రదంగా దీనిని హిందూ సొసైటీకి అప్పగించి, మసీదును మరో చోటకు తరలించుకోవాలన్నారు.