Share News

Pankaj Udhas: ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత

ABN , Publish Date - Feb 26 , 2024 | 04:48 PM

బాలీవుడ్‌లో గజల్, ప్లేబ్యాక్ సింగర్‌గా విశిష్ఠ గుర్తింపు తెచ్చుకున్న పంకజ్ ఉదాస్ (Pankaj Udhas) సోమవారం సోమవారం కన్నుమూశారు. 72 ఏళ్ల వయసున్న ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు ఒక నోట్‌ను విడుదల చేశారు. పంకజ్ ఉదాస్ కూతురు నయాబ్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

Pankaj Udhas: ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత

ముంబై: బాలీవుడ్‌లో గజల్, ప్లేబ్యాక్ సింగర్‌గా విశిష్ఠ గుర్తింపు తెచ్చుకున్న పంకజ్ ఉదాస్ (Pankaj Udhas) సోమవారం సోమవారం కన్నుమూశారు. 72 ఏళ్ల వయసున్న ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు ఒక నోట్‌ను విడుదల చేశారు. పంకజ్ ఉదాస్ కూతురు నయాబ్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మశ్రీ పంకజ్ ఉదాస్ ఫిబ్రవరి 26న కన్నుమూశారు. చాలా భారమైన హృదయంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇట్లు ఉదాస్ ఫ్యామిలీ’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా పంకజ్ ఉదాస్ తన గాత్రంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బాగా పాపులారిటీ సంపాదించిన పాటల్లో 'చిట్టి ఆయీ హై', 'చండీ జైసా రంగ్ తేరా', 'తోడి తోడి పియా కరో', 'ఏక్ తరఫ్ ఉస్కా ఘర్', 'ఆజ్ జింకే కరీబ్ హోతే హై' వంటి సాంగ్స్ ఉన్నాయి. కాగా పంకజ్ ఉదాస్ మరణవార్త విని అభిమానులు, పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సోనూ నిగమ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సంతాపం తెలియజేశారు. "నా బాల్యంలో అత్యంత ముఖ్యమైన భాగం ఈ రోజు కోల్పోయాను. పంకజ్ ఉదాస్ గారిని కోల్పోతున్నాను. మీరు ఇక లేరని తెలిసి నా హృదయం విలపిస్తోంది. ఓం శాంతి’’ అంటూ రాసుకొచ్చారు.

Updated Date - Feb 26 , 2024 | 05:21 PM