రేపు సీడబ్ల్యూసీ సమావేశం
ABN , Publish Date - Mar 18 , 2024 | 03:34 AM
లోక్సభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) మంగళవారం సమావేశం కానుంది.
![రేపు సీడబ్ల్యూసీ సమావేశం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పార్లమెంటు ఎన్నికలకు మేనిఫెస్టో ఖరారు
న్యూఢిల్లీ, మార్చి 17: లోక్సభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) మంగళవారం సమావేశం కానుంది. ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టోపై చర్చించి తుదిరూపు ఇవ్వనుంది. ప్రత్యేకించి ఐదు గ్యారెంటీల పేరిట ఇవ్వనున్న హామీలపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. దీంతోపాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) కూడా 19, 20వ తేదీల్లో భేటీ కానుంది. ఇప్పటిదాకా అభ్యర్థులను ప్రకటించని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది.