Share News

శ్రీకృష్ణ జన్మభూమి సర్వేపై స్టే కొనసాగింపు

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:51 AM

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు ఆవరణ వివాదం విషయమై గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. కోర్టు కమిషనర్‌ పర్యవేక్షణలో ఆ ఆవరణలో

శ్రీకృష్ణ జన్మభూమి సర్వేపై స్టే కొనసాగింపు

న్యూఢిల్లీ, జనవరి 29: మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు ఆవరణ వివాదం విషయమై గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. కోర్టు కమిషనర్‌ పర్యవేక్షణలో ఆ ఆవరణలో శాస్త్రీయ సర్వే జరపాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఈ నెల 16న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ ప్రథమ పక్షానికి వాయిదా వేసింది. ఈ విషయానికి సంబంధించిన మిగిలిన అన్ని పిటిషన్లను కూడా అదే రోజు చేపడుతామని తెలిపింది. ఆ లోగా లిఖితపూర్వక వాదనలను పూర్తి చేయాలని అన్ని పక్షాలను ఆదేశించింది.

Updated Date - Jan 30 , 2024 | 07:49 AM