ఎస్బీఐ ‘జాబితా’ వెనుక కేంద్ర పెద్దలు
ABN , Publish Date - Mar 16 , 2024 | 05:02 AM
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఒక్కో రాజకీయ పార్టీకి కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన వివరాలను సవివరంగా వెల్లడించాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి
న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఒక్కో రాజకీయ పార్టీకి కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన వివరాలను సవివరంగా వెల్లడించాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఎస్బీఐ వెలువరించిన జాబితా వెనుక కేంద్ర పెద్దలున్నారని ఆరోపించారు. దొంగలను కాపాడేందుకే ఎస్బీఐ వివరాలు సరిగా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కార్పొరేట్ కంపెనీలు ఎన్నికల బాండ్ల ద్వారా క్విడ్ ప్రో కోకు పాల్పడ్డాయని ఆరోపించారు.