Share News

వీసా, పాస్‌పోర్ట్‌ల రద్దు!

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:04 AM

పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్‌తో రైతులు చేపట్టిన ఆందోళనలో భాగంగా హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న రైతు నిరసనకారులతోపాటు పంజాబ్‌-హరియాణా

వీసా, పాస్‌పోర్ట్‌ల రద్దు!

  • ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన రైతు నిరసనకారుల పట్ల హరియాణా పోలీసుల నిర్ణయం

చండీగఢ్‌, ఫిబ్రవరి 29: పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్‌తో రైతులు చేపట్టిన ఆందోళనలో భాగంగా హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న రైతు నిరసనకారులతోపాటు పంజాబ్‌-హరియాణా సరిహద్దు వెంబడి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై కొర డా ఝళిపించేందుకు హరియాణా పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వారి పాస్‌పోర్టులతోపాటు వీసాలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వారి వీసాలు, పాస్‌పోర్టులను రద్దు చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖ, ఎంబసీని కోరనున్నట్టు అంబాలా డీఎస్పీ జోగిందర్‌ శర్మ పేర్కొన్నారు. వారి ఫొటోలు, పేరు, చిరునామాను పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో ఇవ్వనున్నట్టు చెప్పారు. రైతుల నిరసన పేరుతో పంజాబ్‌ నుంచి హరియాణాకు వస్తున్న నిరసనకారులతోపాటు హింసకు పాల్పడుతున్న వారిని సీసీటీవీ, డ్రోన్‌ కెమెరాల ద్వారా గుర్తించినట్టు చెప్పారు.

Updated Date - Mar 01 , 2024 | 08:21 AM