UP: రామాలయంలో పోస్టర్ల కలకలం.. బాంబు పెట్టామంటూ బెదిరింపు
ABN , Publish Date - Jan 28 , 2024 | 02:38 PM
ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని శ్రీరాముడి(Lord Ram) ఆలయానికి బాంబు బెదిరింపు(Bomb Threat) రావడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పుర్(Kanpur)లోని రామ్ జానకి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బెదిరింపు లేఖలను గుర్తించారు.
కాన్పుర్: ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని శ్రీరాముడి(Lord Ram) ఆలయానికి బాంబు బెదిరింపు(Bomb Threat) రావడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పుర్(Kanpur)లోని రామ్ జానకి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బెదిరింపు లేఖలను గుర్తించారు. వాటిని గోడలకు అతికించి, మరి కొన్నింటిని నేలపై పడేశారు. ఆలయ ధర్మకర్త రోహిత్ సాహు ఉదయాన్నే ఆలయాన్ని తెరిచి చూసి విషయాన్ని గమనించారు.
అప్పటికే తన ఇంటికి కూడా బెదిరింపు లేఖ వెళ్లినట్లు సాహు తెలిపారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన వారం తరువాత ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు తలుపులు మూసి, ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు రాసిన లేఖలో అసభ్యకరవిషయాలను ప్రస్తావించారని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.