Share News

Bangladesh: కోల్‌కతాలో ఎంపీ అదృశ్యం..!

ABN , Publish Date - May 22 , 2024 | 03:14 PM

వైద్య చికిత్స కోసం భారత్ వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ అదృశ్యమైయ్యారు. ఈ ఘటన కోల్‌కత్తాలో చోటు చేసుకుంది. ఎంపీ అజిమ్ అనార్ ఆచూకీ కోసం చర్యలు చేపట్టినట్లు కోల్‌కతా పోలీసులు బుధవారం వెల్లడించారు.

Bangladesh: కోల్‌కతాలో ఎంపీ అదృశ్యం..!
Anwarul Azim Anar

కోల్‌కతా, మే 22: వైద్య చికిత్స కోసం భారత్ వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ అదృశ్యమైయ్యారు. ఈ ఘటన కోల్‌కత్తాలో చోటు చేసుకుంది. ఎంపీ అజిమ్ అనార్ ఆచూకీ కోసం చర్యలు చేపట్టినట్లు కోల్‌కతా పోలీసులు బుధవారం వెల్లడించారు. అయితే ఆయన హత్య గావింపడ్డారని.. న్యూటౌన్ ప్రాంతంలో ఆయన మృతదేహం ఉండవచ్చని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. మే 12వ తేదీ వైద్య చికిత్స కోసం కోల్‌కత్తాలో తన స్నేహితుడు గోపాల్ బిస్వాస్ నివాసానికి అజిమ్ అనార్ వచ్చారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన అదృశ్యమయ్యారు. దీంతో ఎంపీ స్నేహితుడు గోపాల్ బిస్వాస్ పోలీసులకు పిర్యాదు చేశారు. మరోవైపు ఎంపీ అదృశ్యంపై ఆయన కుటుంబ సభ్యులు బంగాద్లేశ్ ప్రధాని షేక్ హసీనాకు సమాచారం అందించారు.


అలాగే ఢిల్లీ, కోల్‌కతాలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాలకు సైతం ఫిర్యాదు చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన ఎంపీగా అన్వరుల్ అజిమ్.. షేక్ హాసినా పార్టీకి చెందిన ఎంపీగా ఉన్నారు.

Updated Date - May 22 , 2024 | 03:49 PM