మైక్రోసా్ఫ్టలో మరోసారి ఉద్యోగాల కోత
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:10 AM
ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆ్ఫలు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కొన్ని బృందాలకు చెందిన ఉద్యోగులను తొలగించినట్లు ‘గీక్వైర్’ అనే మీడియా సంస్థ తెలిపింది.

న్యూఢిల్లీ, జూలై 4: ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆ్ఫలు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కొన్ని బృందాలకు చెందిన ఉద్యోగులను తొలగించినట్లు ‘గీక్వైర్’ అనే మీడియా సంస్థ తెలిపింది. జూన్ 30తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో... కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎంతమందిని తొలగించింది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తాజా తొలగింపులపై మైక్రోసా్ఫ్టపై అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. వ్యాపార నిర్వహణలో భాగంగా సంస్థాగతంగా కొన్ని మార్పులు తప్పవని తెలిపారు. వినియోగదారులకు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందించే క్రమంలో కోతలు సర్వసాధారణమేనని పేర్కొన్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదిలోనే దాదాపు 3 వేల మందిని తొలగించింది.