Raghav Chadha : కేజ్రీవాల్ కాంగ్రెస్కు, రాహుల్ ఆప్కు ఓటేస్తారు
ABN , Publish Date - May 23 , 2024 | 05:44 AM
ఆరోదశ ఎన్నికలకు ముందు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)- కాంగ్రె్సల బంధం గురించి వివరిస్తూ.. మే 25న జరగనున్న ఎన్నికల్లో ఢిల్లీ
![Raghav Chadha : కేజ్రీవాల్ కాంగ్రెస్కు, రాహుల్ ఆప్కు ఓటేస్తారు](https://media.andhrajyothy.com/media/2024/20240511/Untitled_3_f0e6dddf0a.jpg)
న్యూఢిల్లీ, మే 22: ఆరోదశ ఎన్నికలకు ముందు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)- కాంగ్రె్సల బంధం గురించి వివరిస్తూ.. మే 25న జరగనున్న ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్ కాంగ్రె్సకు ఓటేస్తారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆప్కు ఓటేస్తారని చెప్పారు. కంటి ఆపరేషన్తర్వాత యూకే నుంచి తిరిగి వచ్చిన ఆయన దక్షిణ ఢిల్లీ ఆప్ అభ్యర్థి సాహీ రామ్ పహీల్వాన్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ ప్రజలు ఓటేసేముందు తమ పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించి ఓటేయాలని అన్నారు. ఆప్ పథకాలతో ఢిల్లీలోని ప్రతి కుటుంబానికి నెలకు రూ.18వేలు ఆదా అవుతున్నాయని చెప్పారు. ఉచిత విద్యుత్, మందులు, నీరు అలాగే పిల్లల స్కూల్ ఫీజులు, మహిళలకు ఉచిత బస్సులాంటి పథకాలు కొనసాగాలంటే ఆప్కు ఓటేయాలని రాఘవ్ పిలుపునిచ్చారు.