Share News

అమెరికాలో నౌక ఢీకొని కుప్పకూలిన వంతెన

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:54 AM

అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌లో అనూహ్య ప్రమాదం చోటు చేసుకుంది. కంటెయినర్ల లోడుతో వెళ్తున్న ఓ భారీ నౌక పటా్‌పస్కో నదిపై ఉన్న వంతెనను ఢీ కొనడంతో ఆ బ్రిడ్జి కుప్పకూలింది.

అమెరికాలో నౌక ఢీకొని కుప్పకూలిన వంతెన

న్యూయార్‌, మార్చి 26: అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌లో అనూహ్య ప్రమాదం చోటు చేసుకుంది. కంటెయినర్ల లోడుతో వెళ్తున్న ఓ భారీ నౌక పటా్‌పస్కో నదిపై ఉన్న వంతెనను ఢీ కొనడంతో ఆ బ్రిడ్జి కుప్పకూలింది. దాంతో ఆ వంతెనపై వెళ్తున్న వాహనాలు నదిలో పడడంతో కనీసం 20 మంది గల్లంతయినట్టు సమాచారం అందింది. ఆ కంటెయినర్‌ షిప్‌పై పనిచేస్తున్న ఇద్దరు పైలట్లు సహా మొత్తం 22 మంది సిబ్బంది భారత దేశానికి చెందిన వారేనని, వారు సురక్షితంగా ఉన్నారని నౌకను నిర్వహిస్తున్న సినర్జీ మెరైన్‌ గ్రూపు ప్రకటించింది.

Updated Date - Mar 27 , 2024 | 08:10 AM