Share News

Badrinath : బద్రీనాథ్‌ దర్శనం కాకుండానే 650మందికిపైగా భక్తులు వెనక్కి

ABN , Publish Date - May 29 , 2024 | 06:00 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ ఆలయాన్ని దర్శించుకోకుండానే గౌచర్‌ చెక్‌పోస్ట్‌ నుంచి 650 మందికి పైగా భక్తులు వెనుదిరగాల్సి వచ్చింది. రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా

Badrinath : బద్రీనాథ్‌ దర్శనం కాకుండానే 650మందికిపైగా భక్తులు వెనక్కి

రిజిస్ర్టేషన్‌ చేసుకోకపోవడమే కారణం

గోపేశ్వర్‌ (ఉత్తరాఖండ్‌), మే 28: ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ ఆలయాన్ని దర్శించుకోకుండానే గౌచర్‌ చెక్‌పోస్ట్‌ నుంచి 650 మందికి పైగా భక్తులు వెనుదిరగాల్సి వచ్చింది. రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా బద్రీనాథ్‌కు వెళ్లేందుకు రావడం వల్లనే వారిని తిప్పి పంపినట్టు మంగళవారం అధికారులు తెలిపారు. చార్‌ధామ్‌కు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, యాత్ర తొలి రోజుల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను నివారించడానికి ప్రయత్నం చేస్తున్నామని వారు చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకుగాను ఆలయాలను సందర్శించడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చూస్తున్నామని వారు పేర్కొన్నారు.

Updated Date - May 29 , 2024 | 06:00 AM