Share News

కొత్తగా 5 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్కులు!

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:07 AM

ఆక్వా పరిశ్రమకు మద్దతుగా అత్యాధునిక, ఇంటిగ్రేటెడ్‌ సదుపాయాలను కల్పించడం ద్వారా మత్స్యరంగం అభివృద్ధికి, ఆ రంగంలో భాగస్వాములైన అందరికీ అవకాశాలను పెంపొందించడానికి దేశంలో కొత్తగా ఐదు ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా

కొత్తగా 5 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్కులు!

55 లక్షల మందికి ఉపాధి అవకాశాలే లక్ష్యం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆక్వా పరిశ్రమకు మద్దతుగా అత్యాధునిక, ఇంటిగ్రేటెడ్‌ సదుపాయాలను కల్పించడం ద్వారా మత్స్యరంగం అభివృద్ధికి, ఆ రంగంలో భాగస్వాములైన అందరికీ అవకాశాలను పెంపొందించడానికి దేశంలో కొత్తగా ఐదు ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్కులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా కొత్తగా 55 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రకటించింది. ఆక్వా ఎగుమతులను రెట్టింపు చేయడం(లక్ష కోట్ల రూపాయలకు పెంచడం) దీని లక్ష్యం. అలాగే, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎ్‌సవై) ద్వారా ఆక్వా ఉత్పత్తిని హెక్టారుకు 2 టన్నులు చొప్పున పెంచనున్నారు. దేశంలో ప్రస్తుతం హెక్టారుకు 3 టన్నులు చొప్పున ఆక్వా ఉత్పత్తి జరుగుతుండగా, దీనిని 5 టన్నులకు పెంచడం లక్ష్యం. ఆక్వా రంగం ఐదేళ్లలో సమగ్రాభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో రూ.20,050 కోట్ల అంచనా పెట్టుబడులతో 2021 సంవత్సరంలో పీఎంఎంఎ్‌సవై పథకాన్ని ప్రవేశపెట్టారు.

Updated Date - Feb 02 , 2024 | 04:07 AM