Share News

సబ్సిడీలకు 3.81 లక్షల కోట్లు

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:07 AM

కేంద్రం సబ్సిడీలకు రూ.3,80,925 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే 8 శాతం తక్కువ. సవరించిన అంచనాల ప్రకారం ఆహార సబ్సిడీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో

సబ్సిడీలకు 3.81 లక్షల కోట్లు

కేంద్రం సబ్సిడీలకు రూ.3,80,925 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే 8 శాతం తక్కువ. సవరించిన అంచనాల ప్రకారం ఆహార సబ్సిడీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,12,322 కోట్లు వెచ్చించగా... ఇప్పుడు రూ.2,05,250 కోట్లు కేటాయించింది. ఇక ఎరువుల సబ్సిడీకి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులు రూ.2.51 లక్షల కోట్లు. పెట్రోలియం ఉత్పత్తుల సబ్సిడీకి బడ్జెట్‌లో రూ.11,925 కోట్లు కేటాయించారు.

Updated Date - Feb 02 , 2024 | 04:07 AM