Share News

సముద్రంలో నౌక మునిగి 16 మంది గల్లంతు

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:45 AM

ఒమన్‌ తీరానికి సమీపంలో ఒక ఆయిల్‌ ట్యాంకర్‌(నౌక) సోమవారం సముద్రంలో మునిగి 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు.

సముద్రంలో నౌక మునిగి 16 మంది గల్లంతు

వారిలో 13 మంది భారతీయులు

మస్కట్‌, జూలై 16: ఒమన్‌ తీరానికి సమీపంలో ఒక ఆయిల్‌ ట్యాంకర్‌(నౌక) సోమవారం సముద్రంలో మునిగి 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వారిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక వాసులు. ఈమేరకు ఒమన్‌ తీరరక్షక దళం మంగళవారం వెల్లడించింది. సముద్రంలో ఆ నౌక తిరగబడి కనిపిస్తోందని తెలిపింది. అయితే దానిలోంచి ఆయిల్‌ లీకవుతోందా... లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఎడెన్‌ ఓడరేవుకు వెళుతోన్న ఈ నౌక ఒమన్‌కు చెందిన పారిశ్రామిక ఓడరేవు దక్మ్‌కు సమీపంలో సముద్రంలో మునిగింది.

Updated Date - Jul 17 , 2024 | 07:18 AM