Share News

Ramzan: రంజాన్‌ కానుకగా దుబాయిలో ఖైదీల విడుదల

ABN , Publish Date - Mar 11 , 2024 | 09:02 AM

రంజాన్‌ పవిత్ర మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని దుబాయి జైలులో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల్లో ఎంపిక చేసిన వారికి దుబాయి రాజు మొహమ్మద్‌ అల్‌ మోఖ్తుం క్షమాభిక్ష ప్రసాదించారు.

Ramzan: రంజాన్‌ కానుకగా దుబాయిలో ఖైదీల విడుదల

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): రంజాన్‌ పవిత్ర మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని దుబాయి జైలులో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల్లో ఎంపిక చేసిన వారికి దుబాయి రాజు మొహమ్మద్‌ అల్‌ మోఖ్తుం క్షమాభిక్ష ప్రసాదించారు. వారిని జైలు నుంచి విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దుబాయితో పాటు అబుధాబి, షార్జా, రాస్‌ అల్‌ ఖైమా, ఫుజిరా, ఆజ్మాన్‌ ఎమిరేట్లలో ఇప్పటి వరకు మొత్తం 2,592 మంది వివిధ దేశాలకు చెందిన ఖైదీలను రంజాన్‌ సందర్భంగా విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రతి రంజాన్‌ సందర్భంగా గల్ఫ్‌ దేశాల్లోని జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఆయా దేశాల రాజులు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. హత్య, దొంగతనం, మహిళలపై అత్యాచారం, డ్రగ్స్‌ కేసుల్లో దోషులు క్షమాభిక్షకు అనర్హులు.

Updated Date - Mar 11 , 2024 | 09:03 AM